పల్లవి
రావా రావా రావా యేసయ్యా
మా ఎదలో ఉదయించ రావా యేసయ్యా
మా మదిలో నివసింప రావా
యేసయ్యా ||2||
కో: యేసయ్యా చిన్ని-యేసయ్యా
యేసయ్యా బాల మెస్సయ్యా, ||2||
1 వ చరణం..
పుడమిపైన నరులందరు ఒక్కటే నని
నీదు చెంత చేరేందుకు అర్హులే నని ||2||
జ్ఞానులైన హీనులైన సమమేనని ||2||
నిన్ను చూడ జాడ తెలిపి కరుణించితివే ||2||
2 వ చరణం..
భేద భావమెరుగనట్టి నీదు బిడ్డలం
ప్రేమతో కలిసి బ్రతుకు సంఘ జీవులం ||2||
నిన్ను కొలువ చేయి కలిపి చెంతకొస్తిమి ||2||
చింతలన్ని బాపి మమ్ము కరుణ బ్రోవుము ||2||